హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి తీవ్ర నిరాశలో ఉన్నారు. పట్టున్న మండలాల్లోనూ టీఆర్ఎస్ లీడ్తో కాంగ్రెస్ డీలా పడింది. మరోవైపు డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి బీజేపీ, టీడీపీలో నెలకొంది. తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఆరో రౌండ్లోనూ టీఆర్ఎస్సే ముందంజలో ఉంది. స్పష్టమైన ఆధిక్యంతో శానంపూడి సైదిరెడ్డి దూసుకెళ్తున్నారు. ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి 12,356 ఓట్ల మెజార్టీ వచ్చింది సైదిరెడ్డికి.