Uttam Kumar Reddy: పైలెట్ నుంచి రాజకీయ నేతగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Uttam Kumar Reddy: 1962 జూన్ 20న ఉత్తమ్‌ జననం

Update: 2023-12-07 08:10 GMT

Uttam Kumar Reddy: పైలెట్ నుంచి రాజకీయ నేతగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

Uttam Kumar Reddy: పైలెట్ నుంచి రాజకీయ నేతగా ఎదిగారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 1962 జూన్ 20న నల్గొండ జిల్లాలో పురుషోత్తం రెడ్డి , ఉషాదేవి దంపతులకు ఉత్తమ్ జన్మించారు. B.Sc లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. భారత వైమానిక దళంలో మాజీ ఫైటర్ పైలట్. మిగ్ 21, మిగ్ 23 లను ఫ్రంట్ లైన్ ఫైటర్ స్క్వాడ్రన్‌లలో నడిపాడు . రాష్ట్రపతి భవన్‌లో భద్రత , ప్రోటోకాల్, పరిపాలన, రాష్ట్రపతి విదేశీ పర్యటనల కంట్రోలర్‌గా పనిచేశారు .

ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 ఎన్నికల్లో కోదాడ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు . 2004 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2009లో హుజూర్‌నగర్ నియోజకవర్గానికి మారిన ఆయన 2009 , 2014 ఎన్నికల్లో విజయం సాధించారు . తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018 ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు .

ఎంపీగా గెలిచిన తర్వాత, 2018లో తాను గెలిచిన హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి జూన్ 5 నుంచి రాజీనామా చేశారు. ఉత్తమ్ కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహనిర్మాణ, బలహీన వర్గాల గృహనిర్మాణ కార్యక్రమాల మంత్రిగా పనిచేశాడు . 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి రేవంత్ కేబినెట్‌లో బెర్త్ సాధించారు. ఉత్తమ్ మార్చి 2015 నుండి జూన్ 2021 వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికారిక అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్‌ రెడ్డి పనిచేశారు. GHMC ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి తరువాత TPCC అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 

Tags:    

Similar News