Uttam Kumar Reddy: 2024లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు
Uttam Kumar Reddy: పార్లమెంటులోప్రశ్నించినందుకే రాహుల్ గాంధీపై అనర్హతవేటు
Uttam Kumar Reddy: పార్లమెంటులో ఆదాని అవినీతిని ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అద్భుతైన విజయంతో దేశానికి ప్రధాని అవుతారని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రకు సంఘీభావంగా మిర్యాలగూడ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి చేపట్టిన పాదయాత్రను విజయవంతంచేయాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లులో శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు.