Kishan Reddy: పార్టీ ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్

Kishan Reddy: చండూర్‎లో కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Update: 2022-10-30 13:41 GMT

Kishan Reddy: పార్టీ ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్

Kishan Reddy: పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు సీఎం కేసీఆర్‌కు లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. చండూరు సభలో సీఎం వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. కేసీఆర్‎పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఆణిముత్యాలని చెప్పుకుంటున్న కేసీఆర్ వారు ఏపార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారో చెప్పాలన్నారు. పార్టీ ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ కేసీఆరేనని చురకలంటించారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలను ఇష్టానుసారంగా కొనుగోలు చేసిన కేసీఆర్‎కు బీజేపీని విమర్శించేస్థాయి లేదన్నారు. ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం నిజమే అయితే ఫామ్ హౌజ్ లో పట్టుకున్న డబ్బులు ఎక్కడున్నాయో ప్రజలకు చెప్పాల్సిన అవసరముందన్నారు. ఇచ్చిన హామీలు మరిచిపోయిన కేసీఆర్ గెలిపిస్తే అభివృద్ది చేస్తామంటూ గొప్పలు చెప్పడం సిగ్గుచేటన్నారు.

Tags:    

Similar News