Kishan Reddy: అంబర్ పేటలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భావోద్వేగం

* కన్నతల్లి దగ్గరకు బిడ్డ వచ్చినట్లుందని ఉద్వేగం * అంబర్ పేట, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు

Update: 2021-08-21 15:30 GMT

కిషన్ రెడ్డి (ఫోటో: ది హన్స్ ఇండియా)

Kishan Reddy: జన ఆశీర్వాద యాత్ర లో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. అంబర్ పేట మీదుగా యాత్ర సాగుతుండగా ఆయన ఉద్వేగానికి గురయ్యారు. ఈ ప్రాంతానికి వస్తే చాలా రోజుల తర్వాత కన్నతల్లి దగ్గరకు బిడ్డ వచ్చినట్లుందన్నారు. తానీ రోజు ఢిల్లీలో ఉండేందుకు కారణం అంబర్ పేట్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజక వర్గ ప్రజలేనని అన్నారు. అంబర్ పేట ప్రజలు నా ప్రాణం అంటూ కంట తడి పెట్టుకున్నారు. కేంద్ర మంత్రి పదవి వచ్చినందుకు సంతోషం కన్నా అంబర్ పేట్ ప్రజలకు దూరమయ్యానన్న బాధే ఎక్కువ ఉందన్నారు.

Tags:    

Similar News