తెలంగాణలో 50వేల ఆర్టీసీ కుటుంబాలు బాధలో ఉన్నాయి
-దేశంమంతటా దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి -తెలంగాణలో 50వేల ఆర్టీసీ కుటుంబాలు బాధలో ఉన్నాయి -సీఎం కేసీఆర్ ఏకపక్ష ధోరణిలో వెళ్తున్నారు- కిషన్ రెడ్డి
దేశమంతటా విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతుంటే, తెలంగాణలో మాత్రం 50వేల ఆర్టీసీ కార్మిక కుటుంబాలు బాధలో ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సమస్యను పరిష్కరించాల్సిన సీఎం ఏకపక్ష ధోరణితో వెళ్తున్నారని అన్నారు. కార్మికులు కూడా పట్టుదలకు పోకుండా సమస్యను పరిష్కారం చేసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.