జనగామలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి తీవ్రగాయాలు
Jangaon: జనగామ జిల్లా రఘునాథపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
జనగామలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి తీవ్రగాయాలు
Jangaon: జనగామ జిల్లా రఘునాథపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హన్మకొండ, జనగామ డిపోలకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. బస్సు లో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. హన్మకొండ నుండి జనగామ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.