Hyderabad: హైదరాబాద్‌లో ఇద్దరు జీహెచ్‌ఎంసీ కార్మికులు మృతి

Hyderabad: మ్యాన్‌హోల్‌కి దిగడంతో ఇద్దరు కార్మికులు గల్లంతు * ఒకరి మృతదేహం వెలికితీత... మరొకరి కోసం గాలింపు

Update: 2021-08-04 04:03 GMT
మ్యాన్ హోల్ లో పడి ఇద్దరు గల్లంతు (ఫైల్ ఇమేజ్)

Hyderabad: జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఇద్దరు కార్మికులను బలి తీసుకుంది. హైదరాబాద్‌ వనస్థలిపురంలో రాత్రిపూట మ్యాన్ హోల్‌లోకి దిగిన ఇద్దరు జీహెచ్‌ఎంసీ కార్మికులు ప్రాణాలు విడిచారు. నిజానికి రాత్రిపూట డ్రైనేజీ క్లీన్‌ చేసేందుకు అనుమతి లేదు. కాంట్రాక్టర్‌ బలవంతం చేయడంతో నలుగురు మ్యాన్‌హోల్‌లోకి దిగారు. ఆ ఊబిలో శివ అనే వ్యక్తి చిక్కుకపోయాడు. అతన్ని కాపాడేందుకు వెళ్లిన అనంతయ్య కూడా గల్లంతయ్యాడు. శివ మృతదేహాన్ని వెలికితీశారు. అనంతయ్య మృతదేహాం కోసం రాత్రి నుంచి గాలిస్తూనే ఉన్నారు. 

Tags:    

Similar News