మంత్రి మల్లన్న పంచులు.. వచ్చే ఎన్నికల్లో 'దేశ్ కీ ప్రధాని' అయ్యేది కేసీఆరే...

Malla Reddy: కాంగ్రెస్, బీజేపీ మీద తనదైన శైలిలో మల్లారెడ్డి దాడి...

Update: 2022-05-27 10:04 GMT

మంత్రి మల్లన్న పంచులు.. వచ్చే ఎన్నికల్లో 'దేశ్ కీ ప్రధాని' అయ్యేది కేసీఆరే...

Malla Reddy: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓటమి కోసం భద్రకాళీ అమ్మవారికి మొక్కుకున్నానని, ఆనాడు పాండవులు అమ్మవారికి మొక్కి యుద్ధానికి బయల్దేరినట్టే... వచ్చే దసరా రోజున కేసీఆర్.. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకొని కేంద్రం మీద యుద్ధానికి బయల్దేరుతారన్నారు. కేసీఆర్ ను ప్రధానమంత్రిని చేయమని అమ్మవారికి మొక్కుకున్నానన్నారు. కాంగ్రెస్, బీజేపీ.. ఈ రెండు పార్టీల నాయకులూ దేశానికి పనికి రారన్నారు. వరంగల్ లో జరిగిన సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడారు.

Tags:    

Similar News