TS High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్‌

TS High Court: నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

Update: 2022-12-01 06:43 GMT

TS High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్‌

TS High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరైంది. నిందితులు సింహయాజి, నందకుమార్‌, రామచంద్రభారతికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. 3 లక్షల చొప్పున పూచీకత్తుతో బెయిల్‌ మంజూరైంది. ప్రతి సోమవారం సిట్‌ ఎదుట హాజరుకావాలని, అలాగే.. పాస్‌పోర్టులు పోలీస్‌ స్టేషన్‌లో సరెండర్‌ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Full View
Tags:    

Similar News