కాంగ్రెస్ నేతలు ఉనికి చాటుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలు సుభిక్షంగా ఉంటే కాంగ్రెస్ నేతలకు నిద్ర పట్టడం లేదని బంగారు తెలంగాణను చూస్తుంటే వారి కళ్లు ఎర్రబడుతున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రాలేదని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ యూసుఫ్గూడలోని కోట్ల విజయ్భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.