Vikarabad: వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు

Vikarabad: వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ సునీత మహేందర్‌రెడ్డి వాహనంపై రాళ్లదాడి

Update: 2022-07-13 13:39 GMT

Vikarabad: వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు

Vikarabad: వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ సునీత మహేందర్‌రెడ్డి వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఛైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా వికారాబాద్ ఎమ్మెల్యేకు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా మర్పల్లిలో ఛైర్‌పర్సన్‌ పర్యటిస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛైర్ పర్సన్ సునీత మహేందర్‌రెడ్డి ముందే గులాబీ పార్టీ శ్రేణులు తన్నుకున్నారు. ఛైర్‌పర్సన్ వాహనంపై రాళ్లతో దాడి చేయడంతో కారు అద్ధాలు ధ్వంసమయ్యాయి. మర్పల్లి గడ్డ ఆనందన్న అడ్డా అంటూ నినాదాలు చేశారు.

Tags:    

Similar News