Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ దాష్టీకం

Vikarabad: గ్రామ సమస్యలపై ప్రశ్నించిన సామాన్యుడిపై దాడి

Update: 2021-09-22 05:27 GMT
వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ సర్పంచ్ దాష్టీకం 

Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ రెచ్చిపోయాడు. గ్రామంలోని సమస్యలపై ప్రశ్నించిన పాపానికి ఓ సామాన్యుడిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ప్రజలు చూస్తుండగానే బూటు కాలితో తన్నుతూ చికతబాదాడు. మార్పల్లి మండల పరిధిలోని దామస్థాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని నీటి సమస్య, డ్రైనేజీ సమస్యపై దృష్టి పెట్టాలని సర్పంచ్‌ జైపాల్‌రెడ్డిని బాధితుడు పిట్టల శ్రీనివాస్‌ కోరాడు. దీంతో ఆగ్రహానికి గురైన సర్పంచ్‌ శ్రీనివాస్‌ను దూషిస్తూ దాడి చేశాడు. ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Tags:    

Similar News