టీఆర్ఎస్ గ్రేటర్ అభ్యుర్థుల రెండో జాబితా విడుదల

Update: 2020-11-19 09:33 GMT

GHMC అభ్యర్ధుల రెండో జాబితాను టీఆర్ఎస్ విడుదల చేసింది. 105మందితో తొలి జాబితా విడుదల చేసిన టీఆర్ఎస్‌ ఇవాళ మరో 20మందితో సెకండ్ లిస్ట్‌ ప్రకటించింది. మరో 25మంది అభ్యర్ధుల పేర్లు ఖరారు చేయాల్సి ఉంది. రెండో జాబితాలో ఆరుగురు సిట్టింగ్‌లకు మరోసారి అవకాశం ఇచ్చింది టీఆర్ఎస్. మైలార్‌దేవ్‌పల్లి సిట్టింగ్ కార్పొరేటర్ పార్టీ మారడంతో అక్కడ కొత్తవారికి అవకాశం ఇచ్చారు.

రెండో జాబితాలో మల్లాపూర్ పూర్ నుంచి దేవేందర్ రెడ్డి, రామంతపూర్- గంధం జ్యోత్స్న, బేగం బజార్- పూజావ్యాస్ బిలాల్, సులేమాన్ నగర్- ఏ సరితా మహేష్ శాస్త్రిపురం- బి, రాజేష్ యాదవ్, మైలార్ దేవ్ పల్లి- టి, ప్రేమ్ దాస్ గౌడ్, రాజేంద్ర నగర్- కొరని శ్రీలత, హిమాయత్ నగర్- హేమలతా యాదవ్, బాగ్ అంబర్ పేట్- పద్మావతీ రెడ్డి, భోలక్ పూర్- బింగి నవీన్ కుమార్, షేక్ పేట్- ఎం సత్యనారాయణ యాదవ్, శేరిలింగం పల్లి- రాగం నాగేంద్ర యాదవ్, బాలానగర్- రవీందర్ రెడ్డి ఆవుల, కూకట్ పల్లి నుంచి సత్యనారాయణ జూపల్లి, వివేకానంద నగర్ కాలనీ నుంచి మాధవరం రోజా రంగారావు, వినాయక్ నగర్- బద్దం పుష్పలతారెడ్డి, అడ్డగుట్ట- ప్రసన్న లక్ష్మి, మెట్టుగూడ- రాసూరి సునీత, బౌద్ధనగర్- కంది శైలజ, బేగం పేట్ నుంచి మహేశ్వరి శ్రీహరి పేర్లను ఖరారు చేశారు. 

Tags:    

Similar News