24న రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ కార్యాలయాలకు శంకుస్థాపన

Update: 2019-06-19 11:58 GMT

టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యవర్గ సమావేశం ముగిసింది. పార్టీ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో కార్యవర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. సభ్యత నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై చర్చించారు. ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. దసరా నాటికి పార్టీ కార్యాలయాలను పూర్తి చేసి ప్రారంభోత్సవం నిర్వహిస్తామని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ 27న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 27నుంచి నెలరోజులపాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.  

Tags:    

Similar News