తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కంటే బలమైన పార్టీ ఏదీ లేదు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

Update: 2019-08-22 08:58 GMT

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కంటే బలమైన పార్టీ ఏదీ లేదన్నారు ఆ పార్టీ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి. పార్టీ చరిత్రలోనే మొదటిసారిగా భారీ సభ్యత్వం నమోదు అయిందన్నారు. క్రియాశీల సభ్యులుగా ఉన్న 20 లక్షల మందికి పార్టీ ఐడీ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. 15 రోజుల్లో సభ్యులకు కార్డులను అందిస్తామన్నారు. కమిటీల నిర్మాణం ఆగస్టు 31లోపు పూర్తి చేస్తామన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కమిటీల కూర్పు ఉంటుందన్నారు. 

Full View

Tags:    

Similar News