Telangana: టీఆర్ఎస్‌లో గ్రూపు తగాదాలు.. అధికారి కాలర్ పట్టుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

TRS MLA Krishna Mohan Reddy: గద్వాలలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల మధ్య గ్రూపు తగాదాలు మరోసారి భగ్గుమన్నాయి.

Update: 2022-11-22 12:44 GMT

Telangana: టీఆర్ఎస్‌లో గ్రూపు తగాదాలు.. అధికారి కాలర్ పట్టుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

TRS MLA Krishna Mohan Reddy: గద్వాలలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల మధ్య గ్రూపు తగాదాలు మరోసారి భగ్గుమన్నాయి. మొన్నటి వరకు అంతర్గతంగా ఉన్న... విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో MLA కృష్ణమోహన్‎రెడ్డి వర్సెస్ జడ్పీ ఛైర్ పర్సన్ సరితగా సాగింది. తాను రాకముందే జడ్పీ ఛైర్ పర్సన్ పాఠశాలను ప్రారంభించడంపై MLA కృష్ణమోహన్‎రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తానురాక ముందే ఎలా ప్రారంభిస్తారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. జిల్లా స్థాయి అధికారి చొక్కా పట్టుకొని దాడి చేయబోయారు. అక్కడే ఉన్న సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

Full View


Tags:    

Similar News