మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనలో ఆలస్యం ఎందుకు?

*అభ్యర్థి ప్రకటన లేకుండా అధికారిక కార్యక్రమాలు చేస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

Update: 2022-09-15 12:30 GMT

మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనలో ఆలస్యం ఎందుకు? 

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికపై అధికార, ప్రతిపక్షాలు వ్యూహప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిని ముందుగా ప్రకటించి సిట్టింగ్‌ సీటులో తగ్గేదే లే అంటూ టీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసిరింది. మరోవైపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డిని అభ్యర్థిగా ఎందుకు ప్రకటించడం లేదు అనే టాక్ కూడా వస్తోంది. మరోవైపు కూసుకుంట్లకే టికెట్ అనే ప్రచారం జరిగినా చివరి నిమిషం వరకు కారు గుర్తు అభ్యర్థి ప్రకటన ఉండదనే టాక్ టీఆర్ఎస్‌లో రోజు రోజుకీ పెరుగుతుండటం కూడా హాట్‌ టాపిక్ అవుతోంది.

Tags:    

Similar News