రేపు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ సర్వసభ్య సమావేశం

*283 మంది ప్రతినిధులకు ఆహ్వానం *ఇవాళ రాత్రికే హైదరాబాద్‌ చేరుకోవాలని ఫోన్లు

Update: 2022-10-04 06:37 GMT

రేపు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ సర్వసభ్య సమావేశం

Hyderabad: రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ సర్వసభ్య సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే.. 283 మంది ప్రతినిధులకు ఆహ్వానం అందింది. ఇవాళ రాత్రికే హైదరాబాద్‌ చేరుకోవాలని ఫోన్లు కూడా వెళ్తున్నాయి. ఇక.. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చేందుకు వీలుగా తీర్మానం ప్రవేశపెట్టనున్నారు నేతలు. అక్బోబర్‌ 6న పార్టీ పేరు మార్పు తీర్మానాలను ఈసీకి ఇవ్వనున్నారు. మరోవైపు రేపు హైదరాబాద్‌కు జేడీయూ నేత కుమారస్వామి రానున్నారు. తండ్రి అనారోగ్యంతో ఉండటంతో హైదరాబాద్‌ అఖిలేష్‌ యాదవ్‌ రాలేకపోతున్నారు.

Tags:    

Similar News