మున్సిపల్ ఎన్నికల బరిలో హిజ్రా పోటీపడుతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ 16వ డివిజన్ నుంచి ట్రాన్స్ జెండర్ సమితి తరపున జరీనా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరీనా మాట్లాడుతూ తనను ప్రజలు ఆదరించాలని, ప్రజా సమస్యలపై పని చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ హిజ్రా ట్రాన్స్ జెండర్స్ జిల్లా కార్యదర్శి గంగ, ఉపాధ్యక్షులు అలక, అక్షర, మాధురి, శ్యామల, లతా, తదితరులు పాల్గొన్నారు.