కామారెడ్డి జిల్లా బీర్కూరులో విషాదం

Kamareddy: బీసీ హాస్టల్‌లో పాముకాటుతో విద్యార్థి మృతి

Update: 2022-09-10 05:17 GMT

కామారెడ్డి జిల్లా బీర్కూరులో విషాదం

Kamareddy: కామారెడ్డి జిల్లా బీర్కూరలో విషాదం చోటు చేసుకుంది. బీర్కురు బీసీ హాస్టల్‌లో ఐదో తరగతి విద్యార్థి పాముకాటుతో మృతి చెందాడు. పాముకాటుకు గురైన విద్యార్థిని హస్పిటల్‌కు తరలించగా.. వార్డెన్ ఏమి కాదని తిరిగి హాస్టల్‌కు తీసుకువచ్చారు. ఉదయం చూసేసరికి విద్యార్థి చనిపోయాడని చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడు నసూర్లాబాద్ మండలం దుర్కికి చెందిన సాయిరాజ్‌గా గుర్తించారు. అయితే హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే విద్యార్థి చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు.

Tags:    

Similar News