Hyderabad: మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నేతలు

Update: 2021-08-26 09:00 GMT

హైదరాబాద్‌లో మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం (ఫైల్ ఫోటో)

Hyderabad: టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బంజారాహిల్స్ లో మల్లారెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ నేతలు దగ్ధం చేశారు. మంత్రి మల్లారెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి పదవిలో కొనసాగుతూ ఓ రౌడీ, గుండాల వ్యాఖ్యలు చేసిన మల్లారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే మంత్రి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు.

Tags:    

Similar News