రేపు ఢిల్లీకి టీ.పీసీసీ చీఫ్ రేవంత్, మాణిక్‌రావ్ ఠాక్రే

Revanth Reddy: టికెట్లపై అధిష్టానం హామీ ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం

Update: 2023-07-18 13:41 GMT

రేపు ఢిల్లీకి టీ.పీసీసీ చీఫ్ రేవంత్, మాణిక్‌రావ్ ఠాక్రే

Revanth Reddy: టీ పీసీసీ చీఫ్ రేవంత్, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎల్లుండి ఖర్గే సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, మందుల సామెల్, గద్వాల జడ్పీ చైర్‌పర్సన్ సరిత, రామారావు పటేల్ తో పాటు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి హస్తం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీకి చెందిన పలువురు నేతలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. టికెట్లపై కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది..

Tags:    

Similar News