Congress: నేడు టీపీసీసీ ప్రచార కమిటీ భేటీ

Congress: సా.5 గంటలకు ప్రదేశ్‌ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ

Update: 2024-03-29 03:38 GMT

Congress: నేడు టీపీసీసీ ప్రచార కమిటీ భేటీ 

Congress: ఆపరేషన్ ఆకర్ష్‌తో జోష్ మీదున్న తెలంగాణ కాంగ్రెస్..అదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీటల్లో గెలుపే లక్ష్యంగా.. వ్యూహాలు రచిస్తోంది.. ఈ నేపథ్యంలోనే... ఇవాళ టీపీసీసీ ప్రచార కమిటీ భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు కమిటీ చైర్మన్ మధుయాష్కీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొంగులేటి హాజరుకానున్నారు. ఇక..సాయంత్రం 5 గంటలకు ప్రదేశ్‌ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ కానుంది. సీఎం రేవంత్‌ అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగే సమావేశంలో మున్షీ, భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, పీఈసీ సభ్యులు పాల్గొననున్నారు. ప్రధానంగా..లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం, మేనిఫెస్టో, పోల్ మేనేజ్‌మెంట్ పై చర్చించే అవకాశముంది.

Tags:    

Similar News