నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. 590 అడుగుల గరిష్ట నీటి సామర్ధ్యానికి గాను ప్రస్తుతం 590 అడుగుల నీటి నిల్వలు ఉన్నాయి. అలల తాకిడికి క్రస్టు గేట్ల నుంచి నీరు వస్తుండటంతో నిన్న రాత్రి 11 గంటల నుంచి 3 గంటల వరకు రెండు గేట్లను ఎత్తివేశారు. దీంతో అధికారులు 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం గేట్ల నుంచి నీరు కిందకు దూకుతుండటంతో ఆ దృశ్యాలు మనోహరంగా ఉన్నాయి. సాగర్ అందాలను తిలకించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.