Bonalu Festival: ఈరోజు పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి చెప్పనున్న మాతంగి

* గతేడాది చెప్పినట్లుగానే హైదరాబాద్‌ను ముంచెత్తిన వరదలు * ఈసారి భవిష్యవాణిలో అమ్మవారు ఏం చెబుతారో అని ఉత్కంఠ

Update: 2021-07-26 01:31 GMT

భవిష్యవాణి (ఫైల్ ఫోటో)

Bonalu Festival 2021 : సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళీ బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అత్యంత కీలకఘట్టమైన రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. మాతంగి పచ్చికుండపై నిలబడి తనలోకి అమ్మవారిని ఆవహించుకొని భవిష్యవాణి చెప్పడం ఆనవాయితీగా వస్తోంది. ఇవాళ మాతాంగి స్వర్ణలత రంగం వినిపించనున్నారు. గతేడాది చెప్పినట్టుగానే హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తాయి. మరీ ఈసారి అమ్మవారు భవిష్యవాణిలో ఏం చెబుతుందో అని నగరవాసుల్లో ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News