మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో పులి సంచారం కలకలం రేపింది. లక్ష్మీపూర్ పంట పొలాల్లో పులి సంచారాం అనవాళ్లు గుర్తించిన గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. పులి పాద ముద్రలు ఉన్నట్లు నిర్ధారించారు. పులి సంచారంతో గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ సిబ్బంది సూచించారు. రైతులు పంట పొలాల చుట్టూ విద్యుత్ వైర్లు అమర్చ వద్దని సూచించారు. విద్యుత్ వైర్లతో పులికి హాని జరిగితే కేసు నమోదవుతుందన్నారు. రెండు రోజుల క్రితం దండేపల్లి మండలంలోనూ పులి అడుగులు గుర్తించారు.