Mancherial: పెద్దపులి సంచారం.. పులి ఆచూకీ కోసం సీసీ కెమెరాలను అమర్చిన సిబ్బంది

Mancherial: 150 మంది సిబ్బందితో అణువణువు గాలింపు చర్యలు

Update: 2024-01-19 06:01 GMT

Mancherial: పెద్దపులి సంచారం.. పులి ఆచూకీ కోసం సీసీ కెమెరాలను అమర్చిన సిబ్బంది

Mancherial: మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్న అటవీశాఖ అధికారులు గుర్తించారు. నీల్వాయి, కుశ్నపల్లి, కోటపల్లి, చెన్నూరు రేంజ్‌లలో.. పులి సంచరిస్తున్నట్టు ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు. కనిపించకుండా పోయిన పులిని K12 పెద్దపులిగా ఫారెస్టు అధికారులు గుర్తించారు. అదృశ్యమైన K12 పులి చివరిసారిగా కొత్తూరు సమీపంలో..వాగు నుంచి వెళ్లినట్టు పాదముద్రల ద్వారా అంచనా వేశారు. 150 మంది సిబ్బందితో అణువణువు గాలింపు చర్యలు చేపట్టారు. పులి ఆచూకీ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News