అడవిలో ఉండాల్సిన జంతువులు జనారణ్యంలోకి వస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొన్ని ఆహారం, నీళ్ల కోసం జనారణ్యంలోకి వస్తుండగా మరికొన్ని దారితప్పి గ్రామాల్లోకి వస్తూ అలజడి సృష్టిస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం నీరాల గ్రామంలో పులి సంచారం వణుకుపుట్టిస్తోంది. రోడ్డు దాటుతుండగా వాహనదారులకు పులి కన్పించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పులి సంచారంతో ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటేనే వణికిపోతున్నారు.