కుమ్రంభీమ్ జిల్లాలోని గిరిజన మహిళ రెసిడెన్సియల్ కళాశాలలో దారుణం జరిగింది. వెల్ఫేర్ హాస్టల్లో ఉంటున్న ముగ్గరు విద్యార్థినిలు గర్భం దాల్చిన ఘటన కలకలం సృష్టించింది. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెంటల్ డిగ్రీ కాలేజీ వసతి గృహానికి చెందిన పదిమంది విద్యార్థినులకు సక్రమంగా రుతుస్రావం రాకపోవడంతో అనుమానం వచ్చి హాస్టల్ సిబ్బంది వారిని రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు సంచలన విషయాలు వెల్లడించారు. పదిమందిలో ముగ్గురు అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటీవ్ వచ్చిందని తెలిపారు. నెల రోజుల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించి ఒకరే గర్భం దాల్చారని వెల్లడించారు. మిగిలిన వారికి నెగిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.