YS Sharmila: మూడు పంటలు అబద్ధం.. 24గంటల కరెంటు పచ్చి అబద్ధం
YS Sharmila: సాగుకు చుక్కనీరు లేక రైతులు బోర్లు వేసుకునే దుస్థితి
YS Sharmila: మూడు పంటలు అబద్ధం.. 24గంటల కరెంటు పచ్చి అబద్ధం
YS Sharmila: బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్న మూడు పంటలు అబద్ధం -24 గంటల కరెంట్ పచ్చి అబద్ధమని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగాణికి నీళ్లిచ్చామని దొర చెబుతుంటే...సాగుకు చుక్క నీరు లేక రైతులు బోర్లు వేసుకునే దుస్థితి నెలకొందన్నారు. మండుటెండల్లో మత్తడి పారుతుందని కేసీఆర్...దొంగ పండుగలు చేస్తుంటే..నారుమడికైనా కాసిన్ని నీళ్ళు లేవనేది రైతుల వాదనని షర్మిల ట్విట్టర్లో పేర్కొన్నారు.