భద్రాద్రి జిల్లా పాల్వంచలో దొంగల హల్‌చల్

Bhadradri Kothagudem: మహిళా నుంచి పర్సు చోరీ, పర్సులు రూ.30వేల నగదు, ఏటీఎం కార్డులు

Update: 2022-08-09 08:29 GMT

భద్రాద్రి జిల్లా పాల్వంచలో దొంగల హల్‌చల్

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో దొంగలు రెచ్చిపోయారు. K.T.P.S. ఉద్యోగిని పద్మ పాల్వంచలోని ఢిల్లీ బజార్‌ లో షాపింగ్‌‌కు వెళ్లారు. సామాగ్రి కొనుగోలు చేసి పర్సు చూడగ కనిపించలేదు. దీంతో ఆమె షాపింగ్ మాల్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించడంతో నలుగురు మహిళలు పర్సును చోరీ చేసినట్లు గుర్తించారు. పర్సులో 30వేల రూపాయలు, ఏటీఎం కార్డులతో పాటు ఇతర విలువైన సామాగ్రి ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News