MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ కేసులో నేటితో ముగిసిన ఎమ్మెల్సీ కవిత కస్టడీ

MLC Kavitha: లిక్కర్‌ పాలసీలో అక్రమాల్లో కవిత కీలక వ్యక్తి -సీబీఐ

Update: 2024-04-15 02:36 GMT

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ కేసులో నేటితో ముగిసిన ఎమ్మెల్సీ కవిత కస్టడీ

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత కస్టడీ నేటితో ముగిసింది. లిక్కర్‌ పాలసీలో అక్రమాల్లో కవిత కీలక వ్యక్తి అని సీబీఐ తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత వంద కోట్ల ముడుపులు అప్పచెప్పారని సీబీఐ అభియోగించింది. సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్‌ చాట్స్‌పై కవితను సీబీఐ ప్రశ్నిచింది. ఈరోజు ఉదయం 10 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో కవితను అధికారులు హాజరుపర్చనున్నారు. కవితను సీబీఐ మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉంది. సీబీఐ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరిస్తే కవితను అధికారులు తీహార్‌ జైలుకు తరలించనున్నారు.

Tags:    

Similar News