గచ్చిబౌలి భూమి కబ్జా ఘటనపై టీజీ వెంకటేష్‌ సోదరుడి కుమారుడు స్పందన...

Gachibowli - Land Kabza: పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు - విశ్వప్రసాద్

Update: 2022-04-18 09:51 GMT

గచ్చిబౌలి భూమి కబ్జా ఘటనపై టీజీ వెంకటేష్‌ సోదరుడి కుమారుడు స్పందన...

Gachibowli - Land Kabza: గచ్చిబౌలి(Gachibowli) లో తమకు జాయింట్ డెవలప్‌మెంట్‌ ప్రాపర్టీ ఉందని, దానిని సుభాస్‌ అనే వ్యక్తికి ఈవెంట్‌ కోసం అనుమతిస్తే.. ఓ గ్రూపు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు టీజీ వెంకటేష్‌ సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్. అన్ని పత్రాలతో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే.. అక్కడ పోలీసులు కూడా.. తమకు వ్యతిరేకంగా FIR నమోదు చేశారని చెప్పారు.

ఆ ఈవెంట్‌కు వచ్చిన తమవారిని పోలీసులు రిమాండ్‌లోకి తీసుకున్నారని అన్నారు. ఇక.. తాను కూడా పరారీలో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, తాను అమెరికాలో ఉన్నట్టు స్పష్టం చేశారు విశ్వప్రసాద్. టీజీ వెంకటేష్‌కు ఈ అంశంతో సంబంధం లేదన్నారు విశ్వప్రసాద్.

Tags:    

Similar News