మే నెలలోనే పదో తరగతి పరీక్షలు : సీఎం కేసీఆర్

ఇక హైకోర్టు నిబంధనల ప్రకారం పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తామని కేసీఆర్ వెల్లడించారు. అవి కూడా మే నెలలోనే పూర్తి చేస్తామని

Update: 2020-05-05 16:57 GMT
KCR (File Photo)

సుదీర్ఘ క్యాబినెట్ మీటింగ్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. ఈ మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మే 29 వరకు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. కరోనా రాష్ట్రంలో అదుపులో ఉందని, ప్రజలు సహకరించాలని కోరారు. కరోనా కట్టడికి మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్ డౌన్ అని అన్నారు. అన్ని జిల్లాలో నైట్ కర్ఫ్యూ రాత్రి ఏడూ నుంచి ఉదయం వరకు ఉంటుందని వెల్లడించారు. ఇక హైకోర్టు నిబంధనల ప్రకారం పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తామని కేసీఆర్ వెల్లడించారు. అవి కూడా మే నెలలోనే పూర్తి చేస్తామని కేసీఅర్ స్పష్టం చేశారు. వారికి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తల్లిదండ్రులు వారికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. 

Tags:    

Similar News