డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం.. ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత

Update: 2019-10-12 14:12 GMT

డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యాయత్నంతో ఖమ్మంలో ఆర్టీసీ కార్మికులు రగిలిపోయారు. రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో తాత్కాలిక సిబ్బందితో నడుస్తున్న బస్‌ను కార్మికులు అడ్డుకున్నారు. అద్దాలను ధ్వంసం చేశారు. తాత్కాలిక డ్రైవర్‌ను చితకబాదేందుకు ప్రయత్నించారు. అంతలోనే ఆ డ్రైవర్‌ తప్పించుకున్నారు. ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ మధ్యాహ్నం డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో అతడి శరీరం 90 శాతం కాలిపోయింది. వెంటనే అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే శ్రీనివాస్‌రెడ్డిని పరీక్షించిన వైద్యులు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. దీనిపై ఆగ్రహంతో రగిలిపోయిన ఆర్టీసీ కార్మికులు రోడ్డుపై ఆందోలన చేపట్టారు. 

Tags:    

Similar News