ఉపాధి కోసం ఎడారి దేశానికి వెళ్లిన ఓ యువకుడు నానా కష్టాలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లికి చెందిన మధు దుబాయ్లో ఉండలేక ఇక్కడికి రాలేక నరకయాతన అనుభవిస్తున్నాడు. ఏజెంట్ చెప్పింది ఒకటి అక్కడ కంపెనీలు చేపిస్తున్న పని మరోకటని కన్నీరుపెట్టుకున్నాడు. ఎనిమిది నెలలుగా అష్టకష్టాలు పడుతున్నానని తనను స్వదేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాడు.