లైట్లు ఆఫ్‌ చేస్తే..పవర్‌ గ్రిడ్‌పై ప్రభావం ఉండదు:ప్రభాకర్‌ రావు

Update: 2020-04-04 08:49 GMT

ఈ ఆదివార రాత్రి 9 గంటలకు ఒకేసారి లైట్లు ఆపివేయడంతో తెలంగాణ పవర్ గ్రిడ్ పై ఎలాంటి ప్రభావం ఉండదని టీఎస్ జెన్కో , ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ఎటువంటి అవాంతరాలు జగరకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పవర్‌ గ్రిడ్‌కు ఏ సమస్య రాకుండా అప్రమత్తంగా ఉన్నామని ఆయన చెప్పారు.

ఇప్పటి నుంచే జాగ్రత్తలు పాటించాలని ప్రభాకర్‌ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కసారిగా లైట్లు ఆపివేస్తే గ్రిడ్ కుప్పకూలుతుందని అనే ప్రచారంలోని నిజంలేదని ఆయన చెప్పారు. కరోనా కట్టడికి ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయండని సూచించారు. కరోనాపై మనం విజయం సాధించాలన్నారు. 

Tags:    

Similar News