తెలంగాణలో బీజేపీ రోజురోజుకీ బలపడుతోంది. వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ టీడీపీ నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కమలం గూటికి చేరగా, నల్గొండ జిల్లాలో ప్రముఖుల నేతలంతా బీజేపీలో చేరడానికి రంగం సిద్ధంచేసుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డిని కలిసి చర్చలు జరిపిన మాదగోని శ్రీనివాస్గౌడ్, పాల్వాయి రజనీకుమారి, సాదినేని శ్రీనివాసరావు, చావా కిరణ్మయి, కడారి అంజయ్యలు త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.