ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్న పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లో తెలుగుతేజం పివి సింధు విజయం సాధించడం గర్వకారణమని తెలంగాణ క్రీడాశాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇలాంటి విజయాలు మరెన్నో సింధు సాధించాలని ఆకాంక్షించారు. గతంలో రెండు సార్లు ప్రయత్నం చేసి ఫైనల్ ఓటమి చెందినప్పటికి ఈ సారి కప్ గెలవడం ఆమెలో ఉన్న పట్టుదల కి నిదర్శనమని అయన అన్నారు .