దేశం మొత్తం లాక్ డౌన్ కారణంగా కఠిన చర్యలు తీసుకుంటున్న తెలంగాణ పోలీసులు హాస్టల్స్లో ఉండే విద్యార్థులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. తాజా పరిస్థితి నేపథ్యంలో హాస్టల్స్ను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అయితే విద్యార్థులు ఊళ్లకు వెళ్లే పరిస్థితులు లేవు. దీనిపై అమీర్పేట, పంజాగుట్టలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న పలువురు విద్యార్థులు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు.
ఇంటికి వెళ్లిపోవడానికి తమకు అనుమతి ఇవ్వాలంటూ వారంతా పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు ఎలాంటి ఆటంకం లేకుండా స్వగ్రామలకు వెళ్లేలా పోలీసులు పాసులు మంజూరు చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో చెక్పోస్ట్ల వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా విద్యార్థులు తమ తమ స్వస్థలాలకు వెళ్లేలా పాసులు మంజూరు చేశామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.