తెలంగాణ మంత్రులు మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కొడిమ్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తితెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొనఢంతో ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. అదే సమయంలో అటువైపుగా వెళుతున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ అటువైపుగా వెళుతున్నారు. ప్రమాదాన్ని గమనించిన మంత్రులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు.