తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్రెడ్డి ఫలితాలు విడుదల చేస్తారని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. గత ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు ఈ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9,42,719 మంది విద్యార్థులు పరీక్షలకు రిజిస్టర్ చేసుకున్నారు. అందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,52,550 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 4,90,169 మంది ఉన్నారు.