ఎమ్మెల్యే అక్బరుద్దీన్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2012లో నిజామాబాద్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అక్బరుద్దీన్ బెయిల్పై ఉన్నారు. అయితే పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కారణంగా అక్బరుద్దీన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హిందూ సంఘటన్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో అక్బరుద్దీన్, సీబీసీఐడీ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.