TS High Court: ఎంపీ కవితకు తెలంగాణ హైకోర్టులో ఊరట

* ఎంపీ కవిత కేసును కొట్టేసిన హైకోర్టు *పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డబ్బులు పంపిణీ చేసారని 2019లో కేసు నమోదు

Update: 2021-09-09 17:00 GMT

మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత (ఫోటో: ది హన్స్ ఇండియా)

MP Kavitha: మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఎంపీ కవిత కేసును కోర్టు కొట్టేసింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డబ్బులు పంపిణీ చేశారని 2019లో కవితపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో ప్రజా ప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించింది. ప్రజా ప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంపీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై ధర్మాసనం స్టే విధించింది.  

Tags:    

Similar News