తెలంగాణలో భారీ వర్షాలు, రెడ్‌ అలర్ట్‌ జారీ – వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణలో ఇవాళ, రేపు రెడ్‌ అలర్ట్‌.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాల హెచ్చరిక, జిల్లా వారీగా వివరాలు.

Update: 2025-08-13 13:05 GMT

Telangana Heavy Rains, Red Alert Issued – Weather Department Warning

తెలంగాణలో వర్షాల తీవ్రత పెరుగుతోంది. వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న ప్రకారం, ఇవాళ మరియు రేపు రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ముఖ్యంగా సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలు అత్యంత ప్రమాదకర వర్షాల ప్రభావంలో ఉండే అవకాశం ఉంది.

ఆరెంజ్‌ అలర్ట్‌ జిల్లాలు

హైదరాబాద్‌, హనుమకొండ, ఆదిలాబాద్‌, జనగామ, కామారెడ్డి, కుమురం భీం-ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ కలర్‌ వార్నింగ్‌ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఎల్లో అలర్ట్‌ ప్రాంతాలు

నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఎల్లో వార్నింగ్‌ అమల్లో ఉంది. రేపు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత అధికంగా ఉంటుంది.

జీహెచ్ఎంసీ పరిధిలో హెచ్చరికలు

జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ రెడ్‌ అలర్ట్, రేపు ఆరెంజ్‌ అలర్ట్ అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు గంటకు 40–50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.

వర్షాల కారణం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణలో ఆగస్టు 17న వర్ష తీవ్రత మరింతగా ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News