రాష్ట్రంలో అన్ని పరీక్షలు వాయిదా : మంత్రి సబిత

Update: 2020-10-20 12:08 GMT

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో నిర్వహించే అన్ని రకాల పరీక్షలను దసరా వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వర్షాల సమయంలో పరీక్షలు నిర్వహిస్తే చాలా మంది విద్యార్థులకు సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీలు, కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించాల్సిన ఎంబీఏ, డిగ్రీ సెమిస్టర్, బీఈడీ పరీక్షలు సైతం ఇటీవల వాయిదా పడ్డాయి.

ఈ నెల 19 నుంచి 20 వరకు జరిగే పరీక్షలను వాయిదా వేసుకున్నాయి. అయితే వాయిదా పడిన పరీక్షలను ఈ నెల 21న నిర్వహిస్తామని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే అన్ని ప్రవేశ పరీక్షలతోపాటు యూజీ, పీజీ, ఇంజినీరింగ్‌ పరీక్షలను మరో మారు వాయిదా వేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇక ఈ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు కూడా ఈ నెల 31 వరకు గడువు పొడిగిస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News