తెలంగాణ గవర్నర్ తమిళసౌ సౌందర్ రాజన్ ..రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ఆమె రాష్ట్రపతి కోవింద్తో సమావేశం అయ్యారు. తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా భేటీ కానున్నారు. రేపు హర్యాణాలో జరగనున్న గవర్నర్ల ఉస సంఘం సమావేశానికి తమిళసై హాజరుకానున్నారు.