Tamilisai: రాజ్‌భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో బోనాల పండుగ

Tamilisai: బోనమెత్తిన గవర్నర్‌ తమిళిసై

Update: 2021-08-09 03:15 GMT

బోనాల పండుగ జరుపుకున్న గవర్నర్ తమిళిసై (ఫైల్ ఇమేజ్)

Tamilisai: హైదరాబాద్‌ రాజ్‌భ‌వ‌న్ ప్రాంగ‌ణంలోని అమ్మవారి గుడిలో ఘ‌నంగా బోనాల పండుగ‌ను నిర్వహించారు. గవర్నర్‌ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ బోనం ఎత్తుకొని అమ్మవారి గుడి వ‌ర‌కు న‌డుచుకుంటూ వ‌చ్చి బోనం స‌మ‌ర్పించారు. గవర్నర్‌ కుటుంబ‌స‌భ్యులు, రాజ్‌భ‌వ‌న్ సిబ్బంది, రాజ్ భ‌వ‌న్ ప‌రివార్‌కు చెందిన మ‌హిళ‌లు కూడా అమ్మవారికి బోనాలు స‌మ‌ర్పించారు. దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాల‌ని, మ‌రింత అభివృద్ధి జరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు గవర్నర్‌ త‌మిళిసై తెలిపారు.

Full View


Tags:    

Similar News