Telangana: కేంద్రం గెజిట్‌పై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం

* ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అభ్యంతరం * సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో కేసీఆర్‌ సర్కార్‌

Update: 2021-07-16 05:49 GMT

కేసీఆర్‌ (ఫైల్ ఫోటో )

Telangana: కృష్ణా,గోదావరి నదీజలాలపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అభ్యంతరం తెలిపింది. దీనిపై తేల్చుకునేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. తెలంగాణకు రావాల్సిన వాటా కోసం ప్రభుత్వం ఎంతవరకు అయినా వెళ్లేందుకు సిద్ధమవుతోంది. 

Tags:    

Similar News